చార్వాకుడు యాగం చేస్తున్నాడు ఎందుకంటే
దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోవటానికట.
దేవుడు మనిషిని సృష్టించాడు.
మనిషి దేవుళ్లను సృష్టించాడు.
దేవుడు మనిషిని భూమిని ఏలుకొమ్మన్నాడు.
సర్వాంతర్యామి, నిరాకారి అయిన దేవుడిని
గుడిలో మనిషి ఖైదు చేసి, భూమిని కబ్జా చేసాడు.
భక్తి కోసం కాక భుక్తి కోసం గుడులను పెంచసాగాడు.
మతాలు, ఆచారాలతో ఆలయాల సంఖ్య పెంచాడు.
జైలులో ఖైదీ స్వేచ్ఛ లాగ అప్పుడప్పుడు
దేవునికి దర్శన సౌభాగ్యం కల్పించాడు.
చార్వాకుడు యాగం చేస్తూనే ఉన్నాడు.
దేవుడు గుడిలోంచి పారిపోయాడు.
యాగంలోంచి తర్కం బయటకు వచ్చింది.
దేవుడు మనిషి హృదయాన్ని వెతుకుతున్నాడు.
తర్కం మెదడును లొంగదీసుకొంది.
No comments:
Post a Comment